పాఠశాలపై పట్టింపేది?

ABN , First Publish Date - 2021-12-06T03:53:01+05:30 IST

మండలంలోని కొత్తగూడ గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠ శాల ఆవరణ దుర్గంధ భరితంగా మారింది. ఒకవైపు స్వచ్ఛభారత్‌ అని ప్రభుత్వం పేర్కొంటున్న ఇక్కడ అది ఏ కోశాన కనిపిం చడం లేదు. పాఠశాల ఎదుటే మురికి నీరు పారుతున్నా, చెత్త కుప్పగా తయారవుతున్న పంచా యతీ అధికారులు పట్టిం చుకోవడంలేదని గ్రామ స్థులు వాపోతున్నారు. దీంతో విద్యార్థులు పాఠ శాలకు వచ్చేందుకు భయ పడుతున్నారు.

పాఠశాలపై పట్టింపేది?
పాఠశాల ఆవరణలో పారుతున్న మురుగు నీరు

- తరగతి గదుల ఎదటే పారుతున్న మురుగు నీరు

- చెత్తాచెదారాన్ని వేస్తున్న గ్రామస్థులు

- పట్టించుకోని అధికారులు

బెజ్జూరు, డిసెంబరు 5: మండలంలోని కొత్తగూడ గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠ శాల ఆవరణ దుర్గంధ భరితంగా మారింది. ఒకవైపు స్వచ్ఛభారత్‌ అని ప్రభుత్వం పేర్కొంటున్న ఇక్కడ అది ఏ కోశాన కనిపిం చడం లేదు. పాఠశాల ఎదుటే మురికి నీరు పారుతున్నా, చెత్త కుప్పగా తయారవుతున్న పంచా యతీ అధికారులు పట్టిం చుకోవడంలేదని గ్రామ స్థులు వాపోతున్నారు. దీంతో విద్యార్థులు పాఠ శాలకు వచ్చేందుకు భయ పడుతున్నారు. పాఠ శాల ఆవరణలోని చేతిపంపు వద్ద ఇం కుడుగుంత నిర్మిం చక పోవడంతో నీరంతా పాఠశాల ఆవరణలో చేరుతోంది. దీంతో దోమలు వృద్ధి చెంది వ్యాదుల బారినపడే అవకాశం ఉంది. పాఠశాల ఎదుటే గ్రామస్థు లంతా చెత్త చెదారం పడే స్తుండ డంతో దుర్ఘందం వెదజల్లు తోందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. గ్రామంలోని చెత్తను తొలగించే ఏర్పాట్లను పంచాయతీ అధికారులు చేపట్టడం లేద న్నారు. గ్రామ పంచాయతీ అధికారులు చెత్తాచెదారం తొలగించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Updated Date - 2021-12-06T03:53:01+05:30 IST