కుక్కలు, పందుల బెడదను నివారించాలి
ABN , First Publish Date - 2022-07-01T06:03:07+05:30 IST
కుక్కలు, పందుల బెడదను నివారించాలి
ధారూరు, జూన్ 30 : కుక్కలు, పందుల బెడదను నివారించాలని ధారూరు పంచాయతీ పరిధిలోని 6వ వార్డు ప్రజలు గురువారం సర్పంచ్ చంద్రమౌళికి వినతిపత్రం అందించారు. వార్డులోని శాలివాహన, పద్మశాలి, వీరభద్రేశ్వర ఆలయ కాలనీలలో కుక్కలు, పందులు గుంపులుగా సంచరిస్తున్నాయని, వెంటనే చర్యలు తీసుకుని కాలనీ ప్రజలకు రక్షణ కల్పించాలని వారు కోరారు.