భారతీయ న్యాయవాదిని కీలక పదవీకి నామినేట్ చేసిన ట్రంప్
ABN , First Publish Date - 2021-01-04T19:11:13+05:30 IST
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతీయ-అమెరికన్ న్యాయవాది విజయ్ శంకర్ను డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ అసోసియేట్ జడ్జిగా నామినేట్ చేశారు.
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతీయ-అమెరికన్ న్యాయవాది విజయ్ శంకర్ను డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ అసోసియేట్ జడ్జిగా నామినేట్ చేశారు. సెనేట్ ఆమోదం లభించగానే శంకర్ అసోసియేట్ జడ్జిగా బాధ్యతలు చేపడతారని, 15 ఏళ్లు ఆయన ఈ పదవీలో కొనసాగుతారని ఆదివారం ట్రంప్ వెల్లడించారు. ఇటీవల రిటైర్డ్ అయిన జాన్ ఆర్ ఫిషర్ స్థానంలో శంకర్ నామినేట్ అయ్యారు. గతేడాది జూన్లోనే మొదటిసారి శంకర్ను ట్రంప్ ఈ పదవికి నామినేట్ చేయడం జరిగింది. ప్రస్తుతం శంకర్ అప్పీలేట్ సెక్షన్ డిప్యూటీ చీఫ్గా, డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్లోని క్రిమినల్ డివిజన్లో సీనియర్ లిటిగేషన్ కౌన్సెల్గా విధులు నిర్వహిస్తున్నారు. శంకర్ డ్యూక్ విశ్వవిద్యాలయం నుంచి తన బాచిలర్స్, కమ్ లౌడ్ పూర్తి చేశారు. అలాగే వర్జీనియా యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ లా నుంచి జూరిస్ డాక్టర్ పట్టా పొందారు. కాగా, వాషింగ్టన్ డీసీకి డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా కోర్ట్ ఆఫ్ అప్పీల్సే అత్యున్నత న్యాయస్థానం. ఈ న్యాయస్థానంలో భారతీయుడైన శంకర్ కీలక పదవీ అధిరోహించనుండటం విశేషం.