రామమందిర నిర్మాణానికి విరాళాల సేకరణ

ABN , First Publish Date - 2021-01-17T06:06:55+05:30 IST

అయోధ్యలో రామమందిరం నిర్మాణంలో భాగంగా విశ్వహిందూపరిషత్‌ శ్రీరామమందిర నిర్మాణ కమిటీ వారు విరాళాల కోసం శనివారం కంభంలో ఇంటింటికి తిరిగారు.

రామమందిర నిర్మాణానికి విరాళాల సేకరణ
కంభంలో విరాళాలు సేకరిస్తున్న శ్రీరామభక్తులు


కంభం, జనవరి 16 : అయోధ్యలో రామమందిరం నిర్మాణంలో భాగంగా విశ్వహిందూపరిషత్‌ శ్రీరామమందిర నిర్మాణ కమిటీ వారు విరాళాల కోసం శనివారం కంభంలో ఇంటింటికి తిరిగారు. మందిర నిర్మాణానికి దాతలు ఇచ్చిన విరాళాలు స్వీకరించిన కమిటీ ప్రతినిధులు రసీదులు అందజేశారు. ఆదివారం కూడా విరాళాలు సేకరించి ఆ మొత్తాన్ని శ్రీరామజన్మభూమి తీర్ధక్షేత్ర ట్రస్టుకు అందజేస్తామన్నారు. ఈ సందర్భంగా ఒక అజ్ఞాత భక్తుడు రూ.1,22,814, జి.హరికృష్ణారెడ్డి రూ.1,11,116 నగదు విరాళంగా ఇచ్చారు.

రాచర్ల : అయోధ్యలోని రామమందిర నిర్మాణం కోసం శనివారం ధర్మజాగరణ జిల్లా ప్రముఖ్‌ కృష్ణారావు, మహిళ ప్రముఖ్‌లు మాధవి, రాజేశ్వరితో కలిసి రాచర్లలో చందాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో ఆర్‌ఎ్‌సఎస్‌ నాయకులు శివమల్లారెడ్డి, బీజేపీ మండల అధ్యక్షుడు పుల్లయ్య, శ్రీరామ సేవకులు వెంకట్‌, గోవిందరాజు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-17T06:06:55+05:30 IST