ఆలయ జీర్ణోద్ధరణకు విరాళం

ABN , First Publish Date - 2021-07-25T05:48:52+05:30 IST

మండలంలోని ఆర్‌ఎస్‌ రంగాపురం గ్రామ శివార్లలో వెలసిన మద్దిలేటి లక్ష్మినరసింహ స్వామి ఆలయ జీర్ణోద్ధరణకు భక్తుడు ఉప్పరి గోపాల్‌ రూ.5.11 లక్షలు విరాళాన్ని ఆలయ ఈవో పాండురంగారెడ్డి, చైర్మన్‌ లక్ష్మీరెడ్డికి శనివారం అందజేశారు.

ఆలయ జీర్ణోద్ధరణకు విరాళం

బేతంచెర్ల, జూలై 24: మండలంలోని ఆర్‌ఎస్‌ రంగాపురం గ్రామ శివార్లలో వెలసిన మద్దిలేటి లక్ష్మినరసింహ స్వామి ఆలయ జీర్ణోద్ధరణకు భక్తుడు ఉప్పరి గోపాల్‌ రూ.5.11 లక్షలు విరాళాన్ని ఆలయ ఈవో పాండురంగారెడ్డి, చైర్మన్‌ లక్ష్మీరెడ్డికి శనివారం అందజేశారు. తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం బూడిదపాడు గ్రామానికి చెందిన ఉప్పరి పెద్ద దొడ్డన్న గారి కుమారుడు ఉప్పరి గోపాల్‌, ఆయన సోదరులు ఈ విరాళాన్ని అందజేసినట్లు ఆలయ ఈవో పాండురంగారెడ్డి తెలిపారు. మండలంలోని మండ్లవానిపల్లె గ్రామానికి చెందిన నాగబాల మద్దయ్య అనే భక్తుడు 400 గ్రాముల వెండి కిరిటాన్ని స్వామివారికి విరాళంగా అందజేసినట్లు ఈవో పాండురంగారెడ్డి తెలిపారు. 


ఒక్కరోజు ఆదాయం రూ.9.47 లక్షలు: 

వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మద్దిలేటి లక్ష్మి నరసింహ స్వామి, అమ్మవారి సేవా టికెట్ల ద్వారా, లడ్డూ ప్రసాదాలు, కళ్యాణకట్ట, రూము బాడుగల ద్వారా రూ.9,47,078 శనివారం ఆదాయం లభించిందని ఈవో పాండురంగారెడ్డి తెలిపారు. 


Updated Date - 2021-07-25T05:48:52+05:30 IST