ఇద్దరికి ఆర్థిక సాయం

ABN , First Publish Date - 2021-01-17T06:05:10+05:30 IST

మండలంలోని రెడ్డిచెర్ల గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న ఇద్దరికి ఆర్ధిక సహాయాన్ని మనోజ్‌ చారిటబుల్‌ ట్రస్టు అధ్యక్షులు కామూరి రమణరెడ్డి అందజేశారు.

ఇద్దరికి ఆర్థిక సాయం
సాయం అందజేస్తున్న రమణారెడ్డి


కొమరోలు, జనవరి 16 : మండలంలోని రెడ్డిచెర్ల గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న ఇద్దరికి ఆర్ధిక సహాయాన్ని మనోజ్‌ చారిటబుల్‌ ట్రస్టు అధ్యక్షులు కామూరి రమణరెడ్డి అందజేశారు. మండలంలోని రెడ్డిచెర్ల గ్రామానికి చెందిన కదిరిపోగు రోజమ్మ, గుర్రం సెల్వరాజులకు ఒక్కొక్కరికి రూ.10వేల చొప్పున రూ.20వేల ఆర్థిక సహాయాన్ని శుక్రవారం రాత్రి అందజేశారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-17T06:05:10+05:30 IST