శ్రీవారికి బంగారు పంచపాత్ర బహూకరణ

ABN , First Publish Date - 2022-05-29T06:30:13+05:30 IST

శ్రీవారికి బంగారు పంచపాత్ర బహూకరణ

శ్రీవారికి బంగారు పంచపాత్ర బహూకరణ
బంగారు పంచపాత్ర, ఉద్ధరణినిని అందుకుంటున్న ఈవో

ద్వారకాతిరుమల: చిన్నతిరుమలేశునికి విజయవాడకు చెందిన భక్తుడు చిరంజీవిరావు శనివారం రూ.10లక్షల విలువైన 196 గ్రాముల బంగారు పంచపాత్ర, ఉద్ధరణినిని బహూ కరించారు. ముందుగా స్వామి, అమ్మవార్లను దర్శించాక చిరంజీవిరావు కుటుంబసభ్యులు ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావుకు వాటిని అందజేశారు.



స్వర్ణమయ, నిత్యాన్నదాన ట్రస్టులకు రూ.3 లక్షలు విరాళం
ద్వారకాతిరుమలేశుని విమాన గోపుర స్వర్ణమయ, నిత్యా న్నదాన ట్రస్టులకు ముగ్గురు భక్తులు శనివారం రూ.3 లక్షలను విరాళంగా అందజేశారు. స్వర్ణమయ పథకానికి గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన దొరబాబు, వసంత్‌ అనురాధ రూ.1,00,116, నిత్యాన్నదాన ట్రస్టుకు గోపాలపురం మండలం వేళ్ల చింతలపూడికి చెందిన కె.రామారావు(రాంపండు) రూ.1,00, 116, చింతలపూడి మండలం ఎర్రగుంటపల్లికి చెందిన ఎన్‌. సాయి సూర్యప్రకాష్‌రెడ్డి రూ.1,00,116 విరాళాన్ని కార్యాలయంలో జమ చేశారు. ఈవో వేండ్ర త్రినాథరావు. ఏఈవో కేఎల్‌ఎన్‌ రాజు దాతల కుటుంబాలకు బాండు పత్రాలను, ప్రసాదాలను అందజేశారు.

Updated Date - 2022-05-29T06:30:13+05:30 IST