ప్రసూతి కేంద్రానికి ఆధునిక పరికరాల విరాళం

ABN , First Publish Date - 2022-07-07T05:25:32+05:30 IST

ప్రసూతి కేంద్రానికి ఆధునిక పరికరాల విరాళం

ప్రసూతి కేంద్రానికి ఆధునిక పరికరాల విరాళం
ప్రసూతి రూమ్‌ను ప్రారంభిస్తున్న డీఎంహెచ్‌వో శ్రీనివాస్‌, వైద్యులు

మేడ్చల్‌, జూలై 6(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): మేడ్చల్‌ మండలం కూషాయిగూడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆధునిక పరికరాలతో ఏర్పాటు చేసిన లేబర్‌ రూమ్‌(ప్రసూతి గది)ని బుధవారం డీఎంహెచ్‌వో పుట్ల శ్రీనివాస్‌ ప్రారంభించారు. ఈ పరికరాలను డాక్టర్‌ రాఘవేంద్ర కులకర్ణి, యూరాలజీ సంస్థ లేబర్‌ రూమ్‌లో ఆపరేషన్లకు అవసరమైన పరికరాలతోపాటు సామాగ్రిని అందజేసింది. ఈ పరికరాలతో ఏర్పాటు చేసిన గదిని అధికారులు ప్రా రంభించారు. పరికరాల విరాళం ఇచ్చిన వైద్యులను ఈ సందర్భంగా సన్మాని ంచారు. కార్యక్రమంలో యూరాలజీ డాక్టర్‌ శ్యామ్‌ జ్యోషి, యూనిట్‌ మేట్‌ జైశంకర్‌, ఇతర వైద్య సిబ్బంది సతీష్‌ నాగిల్ల తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-07T05:25:32+05:30 IST