పలు పనులకు రూ.40 లక్షలు విరాళం

ABN , First Publish Date - 2021-01-17T05:08:05+05:30 IST

ఆలయ, పాఠశాల, బస్‌షెల్టర్‌ నిర్మా ణ పనులకు రూ.40 లక్షలు విరాళంగా ఇవ్వడం అభినందనీయమని దాతను పలువురు అభినందించారు.

పలు పనులకు రూ.40 లక్షలు విరాళం
ఆలయ, పాఠశాల, బస్‌షెల్టర్ల నిర్మాణ పనులకు విరాళం అందజేస్తున్న దాత కార్తీక్‌రెడ్డి

 దాత కార్తీక్‌రెడ్డిని అభినందించిన గ్రామ ప్రజలు

లక్కిరెడ్డిపల్లె, జనవరి16: ఆలయ, పాఠశాల, బస్‌షెల్టర్‌ నిర్మా ణ పనులకు రూ.40 లక్షలు విరాళంగా ఇవ్వడం అభినందనీయమని దాతను పలువురు అభినందించారు. మండలంలోని కస్తూరాజుగారిపల్లె గ్రామం చాగలగుట్టపల్లెకు సమీపంలో ఆంజనేయస్వామి, యల్లమ్మ దేవత, ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కల్పనతో పాటు ప్రయాణికుల సౌకర్యార్థం నూతన బస్‌షెల్టర్‌ ఏర్పాటుకు అదే గ్రామానికి చెందిన పళ్లు కార్తీక్‌రెడ్డి తన సొంత డబ్బు రూ.40 లక్షలు వెచ్చించి నిర్మాణ పనులు చేపట్టడానికి ముందుకు వచ్చారు. అంతేగాక శనివారం గ్రామస్థుల సమక్షంలో చెక్కులను అందజేశారు.  ఈ కార్యక్రమంలో లక్కిరెడ్డిపల్లె మాజీ జడ్పీటీసీ మద్దిరేవుల సుదర్శన్‌రెడ్డి, సిద్దక నాగిరెడ్డి, మాజీ ఎంపీటీసీ నారాయణరెడ్డి,  రామాంజులురెడ్డి, వెంకట్రమణ, శ్రీను, సుబ్బరాయుడు, అంజి, నాగరాజ, గ్రామస్థులు, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-01-17T05:08:05+05:30 IST