షిరిడీ సాయిబాబా ఆలయానికి విరాళం

ABN , First Publish Date - 2021-11-29T05:18:17+05:30 IST

డోన్‌ పట్టణ సమీపంలోని హైవే పక్కన నిర్మిస్తున్న షిరిడీ సాయిబాబా ఆలయానికి విశ్వమోహన్‌ రెడ్డి, భాగ్య దంపతులు రూ.50,116 విరాళం ప్రకటించారు.

షిరిడీ సాయిబాబా ఆలయానికి విరాళం
విరాళాన్ని అందజేస్తున్న భక్తులు

డోన్‌, నవంబరు 28: డోన్‌ పట్టణ సమీపంలోని హైవే పక్కన నిర్మిస్తున్న షిరిడీ సాయిబాబా ఆలయానికి విశ్వమోహన్‌ రెడ్డి, భాగ్య దంపతులు రూ.50,116 విరాళం ప్రకటించారు. ఈ విరాళాన్ని ఆదివారం సాయి కమిటి సభ్యులు భాష్యం రమణగౌడు, డా.ప్రభాకర్‌ రెడ్డికి  అందజేశారు. ఆలయ నిర్మాణం పూర్తయ్యేందుకు దాతలు భాగస్వామ్యం కావాలని ఈ సందర్బంగా బాష్యం రమణగౌడు కోరారు. కార్యక్రమంలో సాయి కమిటీ సభ్యులు కందుకూరు పార్థసారధి, కొండా సురేష్‌, ఆలా మల్లికార్జున రెడ్డి, ఏసీ పుల్లారెడ్డి, ఆర్‌ఎంకే బలరాం పాల్గొన్నారు. 



Updated Date - 2021-11-29T05:18:17+05:30 IST