2,100 కోట్లు..అయోధ్య రామాలయానికి వచ్చిన విరాళాలివీ!
ABN , First Publish Date - 2021-03-02T07:11:56+05:30 IST
అయోధ్య రాముడి ఆలయ నిర్మాణానికి విరాళాలు వెల్లువెత్తాయి. దేశవ్యాప్తంగా 45 రోజుల పాటు జరిగిన విరాళాల సేకరణ కార్యక్రమం శనివారంతో ముగిసింది. మొత్తంగా దాదాపు రూ. 2,100 కోట్లు నిధులు సమీకరించినట్లు ఈ బృహత్
45 రోజుల్లో లక్ష్యానికి రెండింతలు సేకరణ: వీహెచ్పీ
న్యూఢిల్లీ, మార్చి 1: అయోధ్య రాముడి ఆలయ నిర్మాణానికి విరాళాలు వెల్లువెత్తాయి. దేశవ్యాప్తంగా 45 రోజుల పాటు జరిగిన విరాళాల సేకరణ కార్యక్రమం శనివారంతో ముగిసింది. మొత్తంగా దాదాపు రూ. 2,100 కోట్లు నిధులు సమీకరించినట్లు ఈ బృహత్ కార్యక్రమాన్ని నిర్వహించిన విశ్వహిందూ పరిషత్ (వీహెచ్పీ) తెలిపింది. నిధుల సేకరణ ప్రారంభించడానికి ముందు తాము రూ. 1,100 కోట్లు లక్ష్యంగా నిర్ణయించుకుంటే.. ప్రజల నుంచి వచ్చిన అనూహ్య స్పందనతో రూ. 2,100 కోట్లు సమకూరాయని వీహెచ్పీ కేంద్రీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు అలోక్ కుమార్ అన్నారు.