దాతల వితరణ.. కొరవడిన పర్యవేక్షణ

ABN , First Publish Date - 2022-06-26T06:06:07+05:30 IST

జగ్గయ్యపేట ప్రభుత్వాసుపత్రికి రాకెం ఫార్మా కంపెనీ ఇచ్చిన అంబులెన్స్‌ రెండు నెలలుగా మూలపడింది.

దాతల వితరణ.. కొరవడిన పర్యవేక్షణ
రాకెం ఫార్మా కంపెనీ అందించిన అంబులెన్స్‌

వైద్యాధికారుల నిర్లక్ష్యంతో మూలనపడ్డ అంబులెన్స్‌

జగ్గయ్యపేట, జూన్‌ 25 : జగ్గయ్యపేట ప్రభుత్వాసుపత్రికి రాకెం ఫార్మా కంపెనీ ఇచ్చిన అంబులెన్స్‌ రెండు నెలలుగా మూలపడింది. ఆసుపత్రికి అంబులెన్స్‌ లేకపోవటంతో రాకెం కంపెనీ ఉచితం అంబులెన్స్‌ను అందజేసింది. డ్రైవర్‌కు వేతనంతోపాటు ఇందన ఖర్చులను కూడా కంపెనీనే భరిస్తుంది. కేవలం పర్యవేక్షించాల్సిన ఆసుపత్రి అధికారులు, అభివృద్ధి కమిటీ సభ్యులు రెండు నెలలుగా  మూలనపడిన అంబులెన్స్‌ను పట్టించుకోకపోవటంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు, అత్యవసర సమయాల్లో బాధితులను ఆసుపత్రికి తరలించాలంటే అధిక వ్యయంతో ప్రైవేట్‌ అంబులెన్స్‌లను ఆశ్రయించాల్సి వస్తుందని ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. 


Updated Date - 2022-06-26T06:06:07+05:30 IST