పేద విద్యార్థినికి అండగా నిలిచిన దాతలు
ABN , First Publish Date - 2022-08-15T06:40:24+05:30 IST
మండలంలోని కవితా కళాశాలలో ఇంటర్మీడి యట్ పూర్తిచేసిన రేవూరి శ్రీలక్ష్మికి అమెరికా యూనివర్సిటీలో చదవడానికి దాతలు సహకారం అందించినట్లు కళాశాల కరస్పాండెంట్ మాదాల శ్రీధర్, కవితా, శ్రీవిద్య కళాశాలల ప్రిన్సిపాల్స్ కెమిస్ర్టీ వెంకటేశ్వరరావు, గద్దె రఘు ఆదివారం తెలిపారు.
చిలుకూరు, ఆగస్టు 14: మండలంలోని కవితా కళాశాలలో ఇంటర్మీడి యట్ పూర్తిచేసిన రేవూరి శ్రీలక్ష్మికి అమెరికా యూనివర్సిటీలో చదవడానికి దాతలు సహకారం అందించినట్లు కళాశాల కరస్పాండెంట్ మాదాల శ్రీధర్, కవితా, శ్రీవిద్య కళాశాలల ప్రిన్సిపాల్స్ కెమిస్ర్టీ వెంకటేశ్వరరావు, గద్దె రఘు ఆదివారం తెలిపారు. బైపీసీలో 952 మార్కులు సాధించిన శ్రీలక్ష్మికి ఎన్ఆర్ఐ వీర్లపాటి దయాకర్, కళాశాల యాజమాన్యం సహకారంతో అగ్రికల్చర్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసేందుకు అమెరికా యూనివర్సిటీలో సీటు లభించిందని వారు తెలిపారు. అమెరికాలో చదువుతో పాటు వసతి ఖర్చులకు కూడా సహకారం లభించడంతో శ్రీలక్ష్మి ఈ నెల 17న అమెరికాకు వెళ్లనున్నట్లు తెలిపారు. ఈ సందదర్భంగా విద్యార్థిని శ్రీలక్ష్మిని కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, తోటి విద్యార్థులు అభినందించారు.