అక్రమ కేసులకు భయపడొద్దు

ABN , First Publish Date - 2022-08-19T06:58:02+05:30 IST

అక్రమ కేసులకు భయపడొద్దు

అక్రమ కేసులకు భయపడొద్దు
నారా లోకేష్‌తో టీడీపీ సెంట్రల్‌ నియోజకవర్గ నాయకులు

పార్టీ అండగా ఉంటుంది.. టీడీపీ ‘సెంట్రల్‌’ నాయకులకు నారా లోకేష్‌ భరోసా

సత్యనారాయణపురం, ఆగస్టు 18: టీడీపీ నాయకులపైన వైసీపీ ప్రభుత్వం పెడుతోన్న అక్రమ కేసులకు భయపడొద్దని, పార్టీ అండగా ఉంటుందని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ భరోసా ఇచ్చారు. తాడేపల్లిలోని నివాసంలో గురువారం మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో టీడీపీ సెంట్రల్‌ నాయకులు లోకేష్‌ను కలిశారు. వాంబేకాలనీకి చెందిన తెలుగు యువత సెంట్రల్‌ అధ్యక్షుడు కంచి ధనశేఖర్‌పై పాయకాపురం పోలీసులు అక్రమ కేసులు నమోదు చేశారని లోకేష్‌ దృష్టికి బొండా ఉమా తీసుకెళ్లారు. కేసు వివరాలు తెలుసు కున్న లోకేష్‌.. కేసులకు భయపడొద్దని, పార్టీ అండగా ఉంటుందని ఽధైర్యం చెప్పారు. పోలీసులు ఏకపక్షంగా టీడీపీ నేతలపై కేసులు పెట్టడాన్ని ఆయన తప్పుబట్టారు. వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనని ఇంతకింత బదులు తీర్చుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికైనా పోలీసుల తీరు మార్చుకోవాలని హితవు చెప్పారు. లోకేష్‌ను కలిసిన వారిలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు, కార్పొరేటర్‌ కంచి దుర్గ ఉన్నారు.



Updated Date - 2022-08-19T06:58:02+05:30 IST