అధైర్యపడొద్దు.. ఆదుకుంటాం!
ABN , First Publish Date - 2021-07-24T04:34:29+05:30 IST
గత రెండు రోజుల నుం చి కురిసిన భారీ వర్షానికి జిల్లాలో పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని, ఎవరూ అధైర్యపడొద్దని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
మంత్రి అల్లోల భరోసా
సారంగాపూర్, జూలై 23 : గత రెండు రోజుల నుం చి కురిసిన భారీ వర్షానికి జిల్లాలో పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని, ఎవరూ అధైర్యపడొద్దని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని జాం, దుర్గానగర్, బోరిగాం, గోపాల్పేట్, మాలక్ చించోలి, వంజర్ గ్రామాల్లో వర్షాలకు నష్టపోయిన పంటలను పరిశీలించారు. రైతులను త్వరలోనే తప్పక ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.