పారిశుధ్య పనుల్లో అలసత్వం వహించొద్దు
ABN , First Publish Date - 2022-07-02T06:46:39+05:30 IST
పారిశుధ్య ప నుల్లో అలసత్వం వ హించరాదని మునిసిపల్ కమిషనర్ రమణాచారి సిబ్బందిని ఆదేశించారు.
రామగిరి, జూ లై 1: పారిశుధ్య ప నుల్లో అలసత్వం వ హించరాదని మునిసిపల్ కమిషనర్ రమణాచారి సిబ్బందిని ఆదేశించారు. వార్డువాచ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఆయన పట్టణంలోని 39వ వార్డులో పర్యటించారు. ఈ సందర్భంగా నాలాలను శుభ్రం చేయాలని, అండర్గ్రౌండ్ డ్రైనేజీ సమస్యలను పరిష్కరించాలని సిబ్బంది, కాంట్రాక్టర్లను ఆదేశించారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా శ్రవంతి పాఠశాల అధ్యాపకులు, విద్యార్థులతో కలిసి మొక్కలను నాటారు. పాలిథీన కవర్లు వి నియోగిస్తే చర్యలు తప్పవని మునిసిపల్ కమిషనర్ రమణాచారి హెచ్చరించారు. ప్రకాశంబజార్లోని రిలయన్స ట్రెండ్ను ఆకస్మిక తనిఖీ చేశారు. హైదరాబాద్ రోడ్డులో జరుగుతున్న విస్తరణ పనులను ఆయన పరిశీలించారు. ఆయా కార్యక్రమాల్లో కౌన్సిలర్ దాసరి గోపమ్మ, నాయకులు సాయి, డీఈలు వెంకన్న, అశోక్, ఏఈ దీపక్, ఏసీపీ నాగిరెడ్డి, శానిటరీ ఇనస్పెక్టర్ ప్రదీ్పరెడ్డి, మెప్మా సిబ్బంది తదితరులు ఉన్నారు.