రైతులను ఇబ్బంది పెట్టొద్దు: పడాల

ABN , First Publish Date - 2021-07-29T05:21:07+05:30 IST

నూతన రహదారులు నిర్మించి రైతులను దిక్కుతోచని స్థితిలోకి నెట్టవద్దని జడ్పీటీసీ మాజీ సభ్యురాలు పడాల రాజేశ్వరి అన్నారు. భోగాపురం గ్రామంలో బుధవారం వీఎంఆర్‌డీఎ మాస్టర్‌ ప్లాన్‌కు వ్యతిరేకంగా ప్లకార్డులతో భారీ ర్యాలీ నిర్వహించి నిరసన తెలియజేశారు.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు: పడాల
ప్లకార్డులతో నిరసన తెలియజేస్తున్న దృశ్యం


భోగాపురం, జూలై28: నూతన రహదారులు నిర్మించి రైతులను దిక్కుతోచని స్థితిలోకి నెట్టవద్దని జడ్పీటీసీ మాజీ సభ్యురాలు పడాల రాజేశ్వరి అన్నారు. భోగాపురం గ్రామంలో బుధవారం వీఎంఆర్‌డీఎ మాస్టర్‌ ప్లాన్‌కు వ్యతిరేకంగా ప్లకార్డులతో భారీ ర్యాలీ నిర్వహించి నిరసన తెలియజేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ పొలాల మధ్యలో నుంచి రహదార్లు ఏర్పాటు చేస్తే రైతులు తీవ్రంగా నష్టపోతారని వ్యవసాయం లేక రోడ్డున పడతారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు నష్టం కలగకుండా అభివృద్ధిపై దృష్టి సారించాలే గాని రైతులు భూములు కోల్పోయేలా వ్యవహరించవద్దన్నారు. రహదార్లు అన్ని పూర్తిగా గోతులమయమై ఉన్నాయని, వాటిని అభివృద్ధి చేస్తే అభివృద్ధి జరిగినట్లే అన్నారు. అనంతరం రెవెన్యూ కార్యాలయంలో ఆర్‌ఐ రవికుమార్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు పడాల శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-29T05:21:07+05:30 IST