జిల్లాను విభజించ వద్దు
ABN , First Publish Date - 2020-08-08T09:04:28+05:30 IST
శ్రీకాకుళం జిల్లాను విభజించవద్దని బీసీ సంఘం ప్రతినిధులు మంత్రి సీదిరి అప్పలరాజులకు శుక్రవారం వినతిపత్రం అందజేశారు.
గుజరాతీపేట: శ్రీకాకుళం జిల్లాను విభజించవద్దని బీసీ సంఘం ప్రతినిధులు మంత్రి సీదిరి అప్పలరాజులకు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. జిల్లా నుంచి ఎచ్చెర్ల, రాజాం అసెంబ్లీ నియోజకవర్గాలను వేరుచేసి విజయనగరం జిల్లాలో కలిపితే శ్రీకాకుళం 70 ఏళ్ల వెనక్కు వెళ్లి పోతుందన్నారు.
పారిశ్రామిక వాడలు, యూనివర్సిటీలు, త్రిపుల్ ఐటీ ఈ రెండు మండలాల్లోనే ఉన్నాయన్నారు. పాలకొండను అరకు పార్లమెంట్ నియోజకవర్గంలో కలిపితే ఐటీడీఏ ద్వారా రావాల్సిన అభివృద్ధి నిధులు నిలిచిపోతాయన్నారు. ఈ మూడు నియోజకవర్గాలను జిల్లాలోనే ఉంచాలని మంత్రిని కోరారు. కార్యక్రమంలో బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు పిట్టా చంద్రపతిరావు, ఏఐసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి ఆర్ ఎజ్రా, న్యాయవాది జీఎంఎస్ అనీల్రాజు, కె.ప్రసాద్, సూరాడ రాజారావు, బిషప్ సుందరం, నాని, సనపల శివ, కృష్ణ , మత్స్యకార నాయకులు పాల్గొన్నారు.