అక్రమ కేసులతో ఆత్మస్థైర్యం కోల్పోవద్దు

ABN , First Publish Date - 2022-09-28T06:03:48+05:30 IST

టీడీపీ నేతలు, కార్యకర్తలపై పాలకపక్షం బనాయిస్తున్న కేసులతో ఆత్మస్థైర్యం కోల్పోవద్దని మాజీ ఎమ్మెల్సీ, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి గౌనివారి శ్రీనివాసులు పిలుపునిచ్చారు.

అక్రమ కేసులతో ఆత్మస్థైర్యం కోల్పోవద్దు
గౌనివారిని సన్మానిస్తున్న పట్రనారాయణాచారి తదితరులు

టీడీపీ శ్రేణులకు గౌనివారి పిలుపు


రామకుప్పం, సెప్టెంబరు 27: టీడీపీ నేతలు, కార్యకర్తలపై పాలకపక్షం బనాయిస్తున్న కేసులతో ఆత్మస్థైర్యం కోల్పోవద్దని మాజీ ఎమ్మెల్సీ, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి గౌనివారి శ్రీనివాసులు పిలుపునిచ్చారు. మంగళవారం  పార్టీ బీసీ సెల్‌, తెలుగురైతు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు పట్రనారాయణాచారి, నాగభూషణం, ఎస్సీ సెల్‌ జిల్లా అధికార ప్రతినిధి జయశంకర్‌ ఆధ్వర్యంలో మండలంలోని తెలుగుయవత నేతలు గౌనివారి స్వగృహంలో ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా గౌనివారి మాట్లాడుతూ... అక్రమ కేసులతో తాము జైలులో ఉండగా స్వయంగా పార్టీ అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ పరామర్శించి భరోసా ఇచ్చారన్నారు. అదేవిధంగా పార్టీలో ఏ ఒక్కరికి ఏ ఇబ్బంది కల్గినా అధిష్ఠానం అన్నివిధాలా అండగా ఉంటుందన్నారు. అక్రమ కేసులతో టీడీపీ శ్రేణులను కట్టడి చేయాలన్న వైసీపీ పెద్దల పాచికలు పారవన్నారు. రానున్న ఎన్నికల్లో చంద్రబాబును సీఎం చేయడమే ధ్యేయంగా పార్టీ శ్రేణులు శక్తివంచన లేకుండా కృషి చేయాలన్నారు. కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు ఎటువంటి అభివృద్ధి  చేయలేదని సీఎం జగన్‌  సహా, ఆ పార్టీ నేతల దుష్ప్రచారాన్ని తిప్పికొడదామని చెప్పారు. చంద్రబాబు పాలనలో కుప్పం నియోజకవర్గంలో జరిగిన అనూహ్యమైన అభివృద్ధిని గ్రామగ్రామానా ప్రజలకు గుర్తు చేద్దామన్నారు. ఈ కార్యక్రమంలో యువనేతలు సీ.కేశవరెడ్డి, కే.కేశవరెడ్డి, ఉమేష్‌గౌడు, వెంకటరమణ, లక్ష్మీనారాయణ, మంజునాథ్‌, ఆదిల్‌, గిరి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-09-28T06:03:48+05:30 IST