డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు లబ్ధిదారులకు పంపిణీ చేయాలి

ABN , First Publish Date - 2022-05-28T06:45:00+05:30 IST

కాలయాపన చేయకుండా ని ర్మాణం పూర్తయిన డబుల్‌ బెడ్‌రూం ఇ ళ్లను అర్హులైన లబ్ధి దారులకు పంపిణీ చేయాలని నియోజకవర్గ బీజేపీ ఇనచా ర్జి జర్పుల కల్యాణ్‌నాయక్‌ డిమాండ్‌ చేశారు.

డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు లబ్ధిదారులకు పంపిణీ చేయాలి
డబుల్‌బెడ్‌రూం ఇళ్లను పరిశీలిస్తున్న బీజేపీ నాయకులు

దేవరకొండ, మే 27: కాలయాపన చేయకుండా ని ర్మాణం పూర్తయిన డబుల్‌ బెడ్‌రూం ఇ ళ్లను అర్హులైన లబ్ధి దారులకు పంపిణీ చేయాలని నియోజకవర్గ బీజేపీ ఇనచా ర్జి జర్పుల కల్యాణ్‌నాయక్‌ డిమాండ్‌ చేశారు. శుక్రవారం బీజేపీ నాయకులు అంకూరి నర్సింహ, గుండాల అంజయ్యయాదవ్‌తో పాటు నాయకులతో కలిసి పెంచికల్‌పమాడ్‌లో నిర్మాణం పూర్తయిన డబుల్‌బెడ్‌ రూం ఇళ్లను సందర్శించి మాట్లాడారు. ఎమ్మెల్యే చొరవ తీసుకొని అర్హులైన లబ్ధిదారుల కు జూన 30వ తేదీ వరకు పట్టాలు ఇచ్చి డబుల్‌ ఇళ్లు పంపిణీ చేయాలని కోరారు. అనంతరం దేవరకొండలో తహసీల్దార్‌ కిరణ్మయికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు బెజవాడ శేఖర్‌, వినోద్‌, శంకర్‌, తిరుపతిగౌడ్‌, రమేష్‌, పద్మ, చండీశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-05-28T06:45:00+05:30 IST