వ్యాక్సిన్ సిబ్బంది నిర్లక్ష్యం: ఓ యువతికి రెండు డోసుల వాక్సిన్

ABN , First Publish Date - 2021-06-19T04:10:20+05:30 IST

వైద్య సిబ్బంది నిర్లక్ష్యం ఓ యవతి ప్రాణాల మీదకు తెచ్చింది. జిల్లాలో ఓ యువతికి వైద్య సిబ్బంది ఒకేసారి డబుల్

వ్యాక్సిన్ సిబ్బంది నిర్లక్ష్యం: ఓ యువతికి రెండు డోసుల వాక్సిన్

రంగారెడ్డి: వైద్య సిబ్బంది నిర్లక్ష్యం ఓ యువతి ప్రాణాల మీదకు తెచ్చింది. జిల్లాలో ఓ యువతికి వైద్య సిబ్బంది ఒకేసారి డబుల్ డోస్ వ్యాక్సిన్ ఇచ్చారు. గుట్టుచప్పుడు కాకుండా యువతిని ఆసుపత్రిలో అబ్సర్వేషన్‌లో అధికారులు పెట్టారు. వ్యాక్సిన్ కోసం అబ్దుల్లాపూర్ మెట్ జడ్పీహెచ్ఎస్‌కు లక్ష్మీ ప్రసన్న (21) అనే యువతి వెళ్లింది. ఫోన్ మాట్లాడుకుంటూనే నర్స్ పద్మ వెంట వెంటనే రెండు డోసుల వాక్సిన్స్ ఇచ్చింది. వాక్సిన్ వేసుకున్న అనంతరం కొద్దీ సేపటికే లక్ష్మీ ప్రసన్న కళ్ళు తిరిగి కింద పడిపోయింది. వెంటనే వనస్థలిపురం ఏరియా ఆసుపత్రికి ఆ యువతిని అధికారులు తరలించారు. ప్రస్తుతం లక్ష్మీ ప్రసన్న ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. అయినప్పటికీ ఆ యువతిని  వైద్యులు అబ్సర్వేషన్‌లో ఉంచారు. ఆ యువతికి ఏమి జరుగుతుందోనని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. 

Updated Date - 2021-06-19T04:10:20+05:30 IST