బాలికల దినోత్సవం రోజున చిత్తూరు జిల్లాలో దారుణం

ABN , First Publish Date - 2021-01-25T03:47:52+05:30 IST

బాలికల దినోత్సవం రోజున జిల్లాలో దారుణం జరిగింది. మదనపల్లె శివారులోని టీచర్స్ కాలనీలో కన్నతల్లి పద్మజ తన ఇద్దరు కుమార్తెలను..

బాలికల దినోత్సవం రోజున చిత్తూరు జిల్లాలో దారుణం

చిత్తూరు: బాలికల దినోత్సవం రోజున జిల్లాలో దారుణం జరిగింది. మదనపల్లె శివారులోని టీచర్స్ కాలనీలో కన్నతల్లి పద్మజ తన ఇద్దరు కుమార్తెలను డంబుల్స్‌తో కొట్టి  హత్య చేశారు. మృతులు అలేఖ్య (27), సాయి దివ్య (22)గా గుర్తించారు. తల్లి పద్మజ ప్రశాంతికాలనీలోని  ప్రైవేటు స్కూల్లో కరస్పాండెంట్‌గా పని చేస్తున్నారు. తండ్రి పురుషోత్తమనాయుడు మదనపల్లె ఉమెన్స్ కాలేజీ వైస్ ప్రిన్సిపల్‌గా పని చేస్తున్నారు. అలేఖ్య, సాయి దివ్య ఇద్దరు కూడా ఉన్నత విద్య అభ్యసించే విషయంలో తల్లితో గొడవ జరిగినట్లు సమాచారం. అయితే తల్లి పద్మజ మానసిక పరిస్థితి సరిగా లేదని పోలీసులు గుర్తించారు. తల్లి, తండ్రిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. ఇద్దరు పిల్లల్ని కన్న తల్లే చంపడంతో ఈ ఘటన సంచలనంగా మారింది. 


Updated Date - 2021-01-25T03:47:52+05:30 IST