నష్టపరిహారంలో ద్వంద్వ ప్రమాణాలు

ABN , First Publish Date - 2021-12-03T05:42:34+05:30 IST

రాష్ట్రంలో ఇటీవల వరదల్లో మరణించిన వారి కుటుంబాలకు ఒక్కో ప్రాణానికి అయిదు లక్షల రూపాయల పరిహారాన్ని ప్రభుత్వం ప్రకటించింది. అయితే విశాఖలో ఎల్జీ పాలిమర్స్ కర్మాగారంలో జరిగిన గ్యాస్ లీకేజీ దుర్ఘటనలో...

నష్టపరిహారంలో ద్వంద్వ ప్రమాణాలు

రాష్ట్రంలో ఇటీవల వరదల్లో మరణించిన వారి కుటుంబాలకు ఒక్కో ప్రాణానికి అయిదు లక్షల రూపాయల పరిహారాన్ని ప్రభుత్వం ప్రకటించింది. అయితే విశాఖలో ఎల్జీ పాలిమర్స్ కర్మాగారంలో జరిగిన గ్యాస్ లీకేజీ దుర్ఘటనలో మరణించిన వారికి కోటి రూపాయల పరిహారం చెల్లించారు. ఆ సందర్భంలో తప్పు పరిశ్రమ యాజమాన్యానిదే అయినా ప్రభుత్వమే నష్టపరిహారం చెల్లించింది. మరి వరదల విషయంలో తప్పు అధికారుల వైపే ఉన్నదని ప్రజలు భావిస్తున్నారు.  ముందుగా అప్రమత్తం చేయకపోవటం వల్లనే మరణాలు సంభవిస్తున్నాయన్నది బాధితుల అభిప్రాయం. కాబట్టి తప్పు తన వైపు ఉంచుకొని కూడా ప్రభుత్వం ఇలా నష్ట పరిహారం విషయంలో ద్వంద్వ ప్రమాణాలు పాటించడం సరి కాదు. ఇలాంటి సున్నితమైన అంశాలలో పాలకులు పారదర్శకమైన విధానాలను రూపొందించి పాటించాలి.

కంభంపాటి కోటేశ్వరరావు

మురళీ నగర్, విశాఖపట్నం

Updated Date - 2021-12-03T05:42:34+05:30 IST