ఇళ్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలి
ABN , First Publish Date - 2022-08-18T05:52:02+05:30 IST
లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణా లను త్వరితంగా పూర్తి చేయాలని డీపీవో, మండల ప్రత్యేకాధికారి ఎం.నాగలత సూచించారు.
మొగల్తూరు, ఆగస్టు 17: లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణా లను త్వరితంగా పూర్తి చేయాలని డీపీవో, మండల ప్రత్యేకాధికారి ఎం.నాగలత సూచించారు. మొగల్తూరు పంచాయతీ కొండావారి పా లెంలో ఇళ్ల నిర్మాణాలను బుధవారం ఆమె పరిశీలిం చారు. అనంతరం స్ధానిక ఉన్నత పాఠశాలలో నాడు–నేడు పఽథకంలో పాఠశాల అభివృద్ది పనులను, రామన్న పాలెం పంచాయతీ పులపర్తివారితోటలో వర్మీకంపోస్టు యార్డ్ను పరిశీలించారు. మండల పరిషత్ కార్యాలయంలో సచివాలయ ఉద్యోగుల సమావేశంలో ఆమె మాట్లాడారు. సచివాలయాలకు వచ్చే ధరఖాస్తులను ఎప్పటికప్పుడు ఆన్లైన్ చేయాలని సూచించారు. ఈవోఆర్డీ నవీన్, కార్యదర్శి జయరాజు, సచివాలయ కార్యదర్శులు వర్క్ ఇన్స్పెక్టర్ రవి తదితరులు పాల్గొన్నారు.
పెంటపాడు: జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయించాలని మండల ప్రత్యేకాధికారి నాగలింగాచార్యులు అన్నారు. బి.కొండేపాడు, ముదునూరు, ఆకుతీగపాడు గ్రామాల్లో కాలనీలు బుధవారం ఆయన పరిశీలించారు. ఎంపీడీవో దామోధరరావు, సర్పంచ్ దానయ్య, ఏపీఎం టి.బాలకోటయ్య, హౌసింగ్ డీఈ, ఏఈలు ప్రసాద్, రాజేంద్రకుమార్, సిబ్బందిపాల్గొన్నారు.