డ్రెయినేజీ అస్తవ్యస్తం
ABN , First Publish Date - 2022-01-18T06:24:12+05:30 IST
డ్రెయినేజీ అస్తవ్యస్తం
రోడ్లపైకి చేరుతున్న మురుగు
పట్టించుకోని అధికారులు.. ప్రజాప్రతినిధులు
ఇబ్బంది పడుతున్న తెన్నేరు వాసులు
తెన్నేరు (కంకిపాడు), జనవరి 17 : మండలం లోని తెన్నేరులో డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. ఓ పక్క వర్షం నీరు, మరో పక్క మురుగు రోడ్డుపై ప్రవహిస్తున్నాయి. గ్రామ కార్యదర్శి నుంచి జిల్లా పంచాయతీ అధికారికి అనేక మార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకునే వారే లేరంటూ స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓ పక్క మురుగు నీటి సమస్యతో అల్లాడు తుంటే, మరో పక్క తాగు నీటి సమస్య మరింత ఇబ్బంది పెడుతుందని, ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్ర తినిధులు స్పందించి, డ్రెయినేజీ, తాగునీటి సమస్యను పరిష్క రించాలని, ఇందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించాలని స్థానికులు కోరుతున్నారు.