చెత్తతో పూడిపోయిన మురుగు కాలువ!
ABN , First Publish Date - 2021-05-11T03:30:30+05:30 IST
కావలి పట్టణంలోని జొన్నాయగుంట ప్రాంతంలో మురుగు కాలువలు చెత్తతో పూడిపోయి మురుగు నిల్వ చేరి దుర్వాసన వెదజల్లుతున్నాయి.
దుర్వాసనతో ప్రజల అవస్థ
కావలి రూరల్, మే 10: కావలి పట్టణంలోని జొన్నాయగుంట ప్రాంతంలో మురుగు కాలువలు చెత్తతో పూడిపోయి మురుగు నిల్వ చేరి దుర్వాసన వెదజల్లుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ చెత్తను తొలగి తొలగించండి మహా ప్రబో అంటూ వేడుకుంటున్నారు. హైమావతమ్మ రైస్మిల్ సమీపంలో మురుగు కాలువగా మారిన పంటకాలువలో ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్తతో నిండిపోయింది. దుర్గంధం వెదజల్లుతూ దోమలకు నిలయంగా మారింది. వ్యర్ధాలతో కాలువలు నిండి మురుగునీరు పోకుండా నిలిచినప్పటికి కాలువల్లో పూడిక తీయించడంపై అధికారులు దృష్టి సారించడం లేదు. అధికారులు, పాలకులు స్పందించి మురుగునీటి కాలువల్లో పూడిక తీయించాలని ఆయా ప్రాంత వాసులు వేడుకుంటున్నారు.