చింతామణి నాటక ప్రదర్శన నిలుపుదల
ABN , First Publish Date - 2021-11-29T06:30:31+05:30 IST
చింతామణి నాటక ప్రదర్శన నిలుపుదల
వన్టౌన్, నవంబరు 28: నగరంలోని కౌతా పూర్ణానంద కళావేదికలో పౌరాణిక రంగస్థల కళాకారుల సమాఖ్య ఆధ్వర్యంలో ప్రదర్శనకు సిద్ధంగా ఉన్న చింతామణి నాటకాన్ని సత్యనారాయణపురం పోలీసులు ఆదివారం నిలుపుదల చేయించారు. నాటకాన్ని నిలుపుదల చేయాలని కోరుతూ ఆర్యవైశ్య ఐక్యకార్యాచరణ వేదిక కన్వీనర్ డూండి రాకేష్ సత్యనారాయణపురం పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. ఆమేరకు పోలీసులు చర్యలు తీసుకున్నారు. తుమ్మలపెంట శ్రీనివాసులు, పేర్ల రవి, గుప్తా, సుబ్బారావు, సత్యనారాయణ, కుమార్ తదితరులు రాకేష్ వెంట ఉన్నారు.