ఒకే వేదికపై ద్రౌపది ముర్ము, ప్రణబ్ ముఖర్జీ, యశ్వంత్ సిన్హా: Viral Pic

ABN , First Publish Date - 2022-07-01T21:15:50+05:30 IST

రాష్ట్రపతి ఎన్నికలు సమీపిస్తున్న వేళ అరుదైన ఫొటో ఒకటి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఆ ఫొటోలో

ఒకే వేదికపై ద్రౌపది ముర్ము, ప్రణబ్ ముఖర్జీ, యశ్వంత్ సిన్హా: Viral Pic

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికలు సమీపిస్తున్న వేళ అరుదైన ఫొటో ఒకటి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఆ ఫొటోలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ (Pranab Mukherjee), ప్రస్తుతం రాష్ట్రపతి రేసులో ఉన్న ద్రౌపది ముర్ము (Draupadi Murmu), యశ్వంత్ సిన్హా (Yashwant Sinha) ఉన్నారు. జార్ఖండ్‌లోని హజారీబాగ్‌‌లో ఉన్న వినోబా భావే యూనివర్సిటీ (Vinoba Bhave University)లో జరిగిన 7వ స్నాతకోత్సవానికి సంబంధించిన ఫొటో ఇది.


ఈ కార్యక్రమానికి అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ సమయంలో జార్ఖండ్ (Jharkhand) గవర్నర్‌గా ఉన్న ప్రస్తుత ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము యూనివర్సిటీ చాన్స్‌లర్‌ హోదాలో హాజరయ్యారు. ఘనంగా జరిగిన ఈ స్నాతకోత్సవంలో ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ప్రస్తుతం ప్రతిపక్షాల తరపు రాష్ట్రపతి రేసులో ఉన్న యశ్వంత్ సిన్హా గౌరవ డి.లిట్ డిగ్రీ అందుకున్నారు. ఒకే ఫ్రేమ్‌లో వీరి ఫొటో సోషల్ మీడియాలో తెగ షేర్ అవుతోంది.

Updated Date - 2022-07-01T21:15:50+05:30 IST