draupadi murmu నామినేషన్ : ఢిల్లీలోని ఒడిశా భవన్కు కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు
ABN , First Publish Date - 2022-06-24T17:12:14+05:30 IST
అధ్యక్ష ఎన్నికల్లో ఎన్డీఏ(NDA) అభ్యర్థి ద్రౌపది ముర్ము మరికాసేపట్లో పార్లమెంట్కు బయలుదేరనున్నారు.
న్యూఢిల్లీ : అధ్యక్ష ఎన్నికల్లో ఎన్డీఏ(NDA) అభ్యర్థి ద్రౌపది ముర్ము(draupadi murmu) మరికాసేపట్లో పార్లమెంట్కు(Parliament) బయలుదేరనున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు రాజ్యసభ సెక్రటరీ జనరల్కు నామినేషన్ పత్రాలు అందజేయనున్నారు. నామినేషన్ ఘట్టానికి ప్రధాని నరేంద్ర మోడీ(Narendra modi), కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరుకానున్నారని సమాచారం. కాగా ఢిల్లీలోని ఒడిశా భవన్కు కేంద్ర మంత్రులు, ఒడిశా నేతలు చేరుకుంటున్నారు. కాగా కేంద్రమంత్రి అమిత్ షా ఇప్పటికే పార్లమెంట్ భవనానికి చేరుకున్నారు.