లంక టూర్కు కోచ్ ద్రావిడ్
ABN , First Publish Date - 2021-06-15T09:22:52+05:30 IST
శ్రీలంక పర్యటనలో టీమిండియా కోచ్గా రాహుల్ ద్రావిడ్ పేరును ఖరారు చేసినట్టు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ చెప్పాడు. లంక టూర్ కోసం వెళ్లే భారత జట్టు 14 రోజుల క్వారంటైన్ను...
న్యూఢిల్లీ: శ్రీలంక పర్యటనలో టీమిండియా కోచ్గా రాహుల్ ద్రావిడ్ పేరును ఖరారు చేసినట్టు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ చెప్పాడు. లంక టూర్ కోసం వెళ్లే భారత జట్టు 14 రోజుల క్వారంటైన్ను సోమవారం ముంబైలో ఆరంభించింది. కొంతకాలంగా అండర్-19, భారత్-ఎ టీమ్లకు ద్రావిడ్ కోచ్గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే నెల 13న మొదలయ్యే టూర్లో లంకతో భారత్ మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీ్సలు ఆడనుంది.