అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వద్దు : డీఆర్‌డీవో

ABN , First Publish Date - 2020-12-03T04:52:14+05:30 IST

అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వద్దు : డీఆర్‌డీవో

అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వద్దు : డీఆర్‌డీవో

ఘట్‌కేసర్‌ రూరల్‌ : డంపింగ్‌యార్డు, వైకుంఠధామాల నిర్మాణాల్లో నిర్లక్ష్యం వహిం చరాదని డీఆర్‌డీవో పీడీ జ్యోతి అధికారులను ఆదేశించారు. బుధవారం ఆమె ఘట్‌కేసర్‌ మండలం ఎదులాబాద్‌లో నిర్మిస్తున్న డంపింగ్‌యార్డు, వైకుంఠధామం నిర్మాణం పనులను ఎంపీపీ సుదర్శన్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. సకాలంలో ఆయా పనులను పూర్తిచేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్‌ కాలేరు సురేష్‌, ఉపసర్పంచ్‌ ఉప్పు లింగేశ్వర్‌రావు, కార్యదర్శి రాసాల నర్సింగ్‌రావు, వార్డుసభ్యులు రాంచందర్‌, నాయకులు జవ్వాజీ సత్తయ్య పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-03T04:52:14+05:30 IST