అడుగంటిన పాలేరు

ABN , First Publish Date - 2022-06-26T06:12:21+05:30 IST

అడుగంటిన పాలేరు

అడుగంటిన పాలేరు
నీరులేక వెలవెలబోతున్న పాలేరు జలాశయం

మరో అడుగు తగ్గితే తాగునీటి సరఫరా నిలిపివేత

కూసుమంచి, జూన్‌ 25: పాలేరు జలాశయం అడుగంటింది. గరిష్టనీటిమట్టం నీటిమట్టం 23 అడుగులకుగాను ప్రస్తుతం 11 అడుగులమేర నీరు నిల్వ ఉంది. జలాశయం నుంచి తాగునీటి అవసరాల నిమిత్తం భగీరఽథ ప్రాజెక్టు ద్వారా ఖమ్మం జిల్లాకు 100 క్యూసెక్కులు, సూర్యాపేట జిల్లాకు 100 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నారు. కాగా జలాశయం నీటిమట్టం మరో అడుగు తగ్గితే ప్రాజెక్టుకు నీరందక తాగునీటి సమస్య ఏర్పడే ప్రమాదం ఉంది. పాలేరు మినీహైడల్‌ పక్కన ఉన్న ప్రాజెక్టుకు, గుర్వాయిగూడెం వద్ద నిర్మితమై ఉన్న ప్రాజెక్టుకు నీరందడం కష్టమవుతుంది. కూసుమంచి, తిరుమలాయపాలెం మండలాల్లో సుమారు 73గ్రామాలకు తాగునీరు సరఫరా నిలిచిపోయే ప్రమాదం ఉంది. పాలేరు జలాశయంలో నీటినిల్వలు తగ్గడంపై ఇప్పటికే ఐబీ అధికారుల దృష్టికి తీసుకొచ్చినట్లు భగీరఽథ ప్రాజెక్టు డీఈ మురళీకృష్ణ తెలిపారు. అయితే సాగర్‌ డ్యామ్‌నుంచి నీటి విడుదలకు మొదటిజోన్‌ పరిధిలో ఆధునీకరణ పనులు జరుగుతుండటం వల్ల నీరు విడదల ఆలస్యం అవుతుందని తెలిపారు. మరోవారం పదిరోజుల్లో సాగర్‌ డ్యామ్‌నుంచి తాగునీటి అవసరాల నిమిత్తం నీరు విడుదల చేయించనున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం 15రోజులపాటు నీటినిల్వలు సరిపోతాయని తెలిపారు.  

Updated Date - 2022-06-26T06:12:21+05:30 IST