తాగునీటి సమస్యను పరిష్కరించాలి
ABN , First Publish Date - 2021-04-22T06:10:13+05:30 IST
తాగునీటి సమస్యను పరిష్కరించాలి
పెనమలూరు, ఏప్రిల్ 21 : కృష్ణానగర్లోని పాతచెక్పోస్టు సెంటర్, పాము వెంకయ్య వీధి ప్రాంతాల్లో కలుషిత తాగునీటి సమస్యను పరిష్కరించాలని స్ధానికులు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ ప్రాంతాల్లో నివాసాలకు ఇచ్చిన తాగునీటి వాటర్ పైపులైన్ తుప్పు పట్టడంతో డ్రెయినేజీలోని మురుగునీరు చేరి కుళాయిల నుంచి రంగుమారిన కలుషితమైన నీరు వస్తుందని వాపోతున్నారు. దీనివల్ల చాలా మంది వాటర్ ప్యూరిఫైర్లు ఏర్పాటు చేసుకున్నారని, వాటిలోకి కూడా కలుషితమైన నీరు చేరి ప్యూరిఫైర్లు పాడైపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజారోగ్యం దృష్ట్యా ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కృష్ణానగర్ వాసులు కోరుతున్నారు.