డ్రిప్‌ పరికరాలను సద్వినియోగం చేసుకోవాలి

ABN , First Publish Date - 2022-09-29T05:46:54+05:30 IST

టి సంరక్షణ కోసం ప్రభుత్వం అందిస్తున్న డ్రిప్‌ ఇరిగేషన్‌ ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా మైక్రో ఇరిగేషన్‌ అధికారి వెంకటేశ్వర్‌రెడ్డి రైతులకు విజ్ఞప్తి చేశారు

డ్రిప్‌ పరికరాలను సద్వినియోగం చేసుకోవాలి
డ్రిప్‌ ఇరిగేషన్‌ పరికరాలను పరిశీలిస్తున్న వెంకటేశ్వర్‌ రెడ్డి

పీలేరు, సెప్టెంబరు 28: నీటి సంరక్షణ కోసం ప్రభుత్వం అందిస్తున్న డ్రిప్‌ ఇరిగేషన్‌ ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా మైక్రో ఇరిగేషన్‌ అధికారి వెంకటేశ్వర్‌రెడ్డి రైతులకు విజ్ఞప్తి చేశారు. పీలేరు మండలం తలపుల గ్రామంలో అమల వుతున్న డ్రిప్‌ ఇరిగేషన్‌ పనులను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సబ్సిడీతో ప్రభుత్వం డ్రిప్‌ పరికరాలు మంజూరు చేస్తోందని, కావాల్సిన రైతులు తమ పరిధిలోని రైతు భరోసా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.  కార్యక్రమంలో పీలేరు హెచ్‌వో సుకుమార్‌రెడ్డి, ఎంఐఏవో కనకదుర్గయ్య, ఆర్‌బీకే అధికారి దరహాస్‌, తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2022-09-29T05:46:54+05:30 IST