డ్రిప్ పరికరాలను సద్వినియోగం చేసుకోవాలి
ABN , First Publish Date - 2022-09-29T05:46:54+05:30 IST
టి సంరక్షణ కోసం ప్రభుత్వం అందిస్తున్న డ్రిప్ ఇరిగేషన్ ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా మైక్రో ఇరిగేషన్ అధికారి వెంకటేశ్వర్రెడ్డి రైతులకు విజ్ఞప్తి చేశారు
పీలేరు, సెప్టెంబరు 28: నీటి సంరక్షణ కోసం ప్రభుత్వం అందిస్తున్న డ్రిప్ ఇరిగేషన్ ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా మైక్రో ఇరిగేషన్ అధికారి వెంకటేశ్వర్రెడ్డి రైతులకు విజ్ఞప్తి చేశారు. పీలేరు మండలం తలపుల గ్రామంలో అమల వుతున్న డ్రిప్ ఇరిగేషన్ పనులను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సబ్సిడీతో ప్రభుత్వం డ్రిప్ పరికరాలు మంజూరు చేస్తోందని, కావాల్సిన రైతులు తమ పరిధిలోని రైతు భరోసా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో పీలేరు హెచ్వో సుకుమార్రెడ్డి, ఎంఐఏవో కనకదుర్గయ్య, ఆర్బీకే అధికారి దరహాస్, తదితరులు పాల్గొన్నారు.