‘సబ్సిడీపై డ్రిప్‌ పరికరాలు’

ABN , First Publish Date - 2022-05-27T05:46:47+05:30 IST

రైతులకు సబ్సిడీపై డ్రిప్‌ పరికరాలు, స్ప్రింక‌ర్ల‌ను ఇస్తామని ఏపీఎంఐపీ పీడీ సత్యనారాయణ తెలిపారు.

‘సబ్సిడీపై డ్రిప్‌ పరికరాలు’
మాట్లాడుతున్న పీడీ సత్యనారాయణ

గడివేముల, మే 26: రైతులకు సబ్సిడీపై డ్రిప్‌ పరికరాలు, స్ప్రింక‌ర్ల‌ను ఇస్తామని ఏపీఎంఐపీ పీడీ సత్యనారాయణ తెలిపారు. గడివేములలోని వ్యవసాయశాఖ కార్యాలయంలో గురువారం ఆయన వ్యవసాయశాఖ సిబ్బంది, రైతులతో సమావేశమయ్యారు. పీడీ మాట్లాడుతూ 5 ఎకరాల లోపు ఉన్న రైతులకు 90 శాతం సబ్సిడీ, 5 ఎకరాల పైన ఉన్న రైతులకు 70 శాతం సబ్సీడీ ఇస్తామని తెలిపారు ఆసక్తి ఉన్న రైతులు పంట సాగు చేసే వివరాలు, కరెంట్‌ బిల్లు,  నీటి లభ్యత వివరాలను స్థానిక వ్యవసాయ సిబ్బందికి అందజేసి ఏపీఎంఐపీ పోర్టల్‌లో అనుసంధానం చేయించుకోవా లన్నారు.  రైతులు ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేసుకొని పంటలు సాగు చేయాలని సూచించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ ఆర్‌బీ చంద్రశేఖర్‌రెడ్డి, మండల వ్యవసాయశాఖ అధికారి హేమసుందర్‌రెడ్డి, వ్యవసాయ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-27T05:46:47+05:30 IST