ముంబై కీలక డ్రగ్ డీలర్ రిమాండ్

ABN , First Publish Date - 2020-12-10T16:37:56+05:30 IST

మహారాష్ట్రలోని ముంబై కేంద్రంగా మాదకద్రవ్యాలు విక్రయిస్తున్న ఘరానా ముఠాకు చెందిన కీలకవ్యక్తి డ్రగ్ డీలరు ఆజాం జుమ్మాన్ షేఖ్ ను...

ముంబై కీలక డ్రగ్ డీలర్ రిమాండ్

ముంబై (మహారాష్ట్ర): మహారాష్ట్రలోని ముంబై కేంద్రంగా మాదకద్రవ్యాలు విక్రయిస్తున్న ఘరానా ముఠాకు చెందిన కీలకవ్యక్తి డ్రగ్ డీలరు ఆజాం జుమ్మాన్ షేఖ్ ను నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్టు చేసి, గురువారం ముంబైలోని కోర్టులో ప్రవేశపెట్టారు. డ్రగ్ డీలరు అయిన ఆజాం జుమ్మాన్ షేఖ్ ఇంటితో సహా ముంబైలోని పలు ప్రాంతాల్లో ఏకకాలంలో నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు ఆకస్మిక దాడులు చేసి పెద్ద ఎత్తున మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. 


ముంబై నగరంలోని లోఖండ్ వాలా వద్ద మిలత్ నగర్ ప్రాంతంలోని ఆజాం జుమ్మాన్ ఇంటి నుంచి ఐదుకిలోల మలనా క్రీం, ఎకస్టేసీ టాబ్లెట్లు, ఓపియం,14లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఐదు కిలోల డ్రగ్ విలువ రెండున్నర కోట్ల రూపాయలని ఎన్సీబీ అధికారులు చెప్పారు. గురువారం ఆజాంను కోర్టులో ప్రవేశపెట్టగా రిమాండుకు తరలించారు.ముంబై డ్రగ్ రాకెట్ బాగోతంపై తాము నిందితుడైన ఆజాంను కస్టడీలోకి తీసుకొని ప్రశ్నిస్తామని నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు చెప్పారు. 

Updated Date - 2020-12-10T16:37:56+05:30 IST