డ్రగ్స్ కేసులో కొత్త కోణం
ABN , First Publish Date - 2022-02-14T20:33:22+05:30 IST
డ్రగ్స్ కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. నాలుగేళ్లలో 250 మందికిపైగా ప్రముఖులు పట్టుబడ్డారు.
హైదరాబాద్: డ్రగ్స్ కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. నాలుగేళ్లలో 250 మందికిపైగా ప్రముఖులు పట్టుబడ్డారు. పోలీసులు చర్యలతో రీహాబిలిటేషన్ సెంటర్కి ప్రముఖుల క్యూ కడుతున్నారు. డీ ఆడిక్షన్ సెంటర్లో సినీ ప్రముఖులు కౌన్సిలింగ్ తీసుకున్నారు. డ్రగ్స్ కేసులో వ్యాపారవేత్తలు, ప్రముఖుల పిల్లలు ఉన్నట్టు గుర్తించారు. కొకైన్, ఐఎస్డీ, ఎండీఎంఏ లాంటి డ్రగ్స్కి ప్రముఖులు బానిసలయ్యారు. డ్రగ్స్కి బానిసైనవారు ఏడాది పాటు డీ ఆడిక్షన్ సెంటర్లో కౌన్సిలింగ్ తీసుకుంటున్నట్లు గుర్తించారు. రీహాబిలిటేషన్ సెంటర్ల ద్వారా పొందిన సర్టిఫికెట్తో కోర్టులో ప్రముఖులకు ఊరట దొరికింది. నాలుగేళ్లలో 250 మందికి న్యాయస్థానం ఇమ్యూనిటీ ఇచ్చింది.