ఫుడింగ్ మింక్ పబ్ డ్రగ్స్ కేసులో రెండో రోజు విచారణ
ABN , First Publish Date - 2022-04-15T21:56:12+05:30 IST
ఫుడింగ్ మింక్ పబ్ డ్రగ్స్ కేసులో నిందితులను రెండో రోజు పోలీసులు విచారిస్తున్నారు. నిందితులు అభిషేక్, అనిల్ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు
హైదరాబాద్: ఫుడింగ్ మింక్ పబ్ డ్రగ్స్ కేసులో నిందితులను రెండో రోజు పోలీసులు విచారిస్తున్నారు. నిందితులు అభిషేక్, అనిల్ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. డ్రగ్స్ పెడ్లర్లలతో లింకులు, గోవా ట్రిప్లపై పోలీసుల ఆరా తీస్తున్నారు. ఫుడింగ్ మింక్ పబ్లో ఓ పార్టీలో డ్రగ్స్ తీసుకున్నట్లు ఆధారాలు దొరికాయి. ఆ పార్టీకి హాజరైనవారి లిస్ట్ను పోలీసులు సేకరించారు. పబ్ మేనేజర్ అనిల్ కనుసన్నల్లోనే డ్రగ్స్ సప్లై జరిగినట్లు గుర్తించారు. పబ్లో 3 టేబుళ్లపై దొరికిన కొకైన్పై నిందితులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.