రూ. 9.82 కోట్ల విలువైన డ్రగ్స్‌ పట్టివేత

ABN , First Publish Date - 2022-02-20T17:40:13+05:30 IST

విదేశాల నుంచి కొరియర్‌ ద్వారా డ్రగ్స్‌ తెప్పించుకుని బెంగళూరులో విక్రయించేందుకు ప్రయత్నించిన ఇద్దరిని బెంగళూరు ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు కస్టమ్స్‌ అధికారులు అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.9.82 కోట్ల

రూ. 9.82 కోట్ల విలువైన డ్రగ్స్‌ పట్టివేత

                  - విదేశాల నుంచి కొరియర్‌ ద్వారా సరఫరా


బెంగళూరు: విదేశాల నుంచి కొరియర్‌ ద్వారా డ్రగ్స్‌ తెప్పించుకుని బెంగళూరులో విక్రయించేందుకు ప్రయత్నించిన ఇద్దరిని బెంగళూరు ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు కస్టమ్స్‌ అధికారులు అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.9.82 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కస్టమ్స్‌ అధికారులు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. స్వాధీనం చేసుకున్నవాటిలో ఏడుకోట్ల విలువైన హెరాయిన్‌ ఉండగా రూ.2.82 కోట్ల విలువ కలిగిన ఎండీఎంఏను గుర్తించారు. విదేశాల నుంచి ఎయిర్‌పోర్టుకు కొరియర్‌ ద్వారా తెప్పించుకున్నారు. రెండు కొరియర్‌లలో బెల్జియం, జాంబియా నుంచి దుబాయ్‌ మీదుగా బెంగళూరు ఎయిర్‌పోర్టుకు వచ్చినట్లు గుర్తించారు. సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ అధికారులకు వచ్చిన సమాచారం మేరకు ఎయిర్‌పోర్టు అధికారులను అప్రమత్తం చేసి పకడ్బందీ వ్యూహంతో ఇద్దరిని అరెస్టు చేశామన్నారు. సమగ్ర దర్యాప్తు సాగిస్తున్నామని, వీటివెనుక కారకులెవరనే దిశగా విచారణ సాగిస్తున్నట్లు ప్రకటించారు. 

Updated Date - 2022-02-20T17:40:13+05:30 IST