టీఆర్ఎస్ ప్రభుత్వం వల్లే తెలంగాణలో డ్రగ్స్ కల్చర్: విజయశాంతి
ABN , First Publish Date - 2022-03-13T21:35:35+05:30 IST
టీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ నేత విజయశాంతి మండిపడ్డారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ
హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ నేత విజయశాంతి మండిపడ్డారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం వల్లే తెలంగాణలో డ్రగ్స్ కల్చర్ వచ్చిందని ఆరోపించారు. సీఎం కేసీఆర్ పాలనలో మహిళలకు భద్రత కరువైందని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కథ ఇక ముగిసినట్టేనని ఎద్దేవాచేశారు. ఉద్యోగాలు ఇస్తామంటూ కేసీఆర్ దొంగ మాటలు చెబుతున్నారని దుయ్యబట్టారు. తెలంగాణలో మార్పు అవసరమని అభిప్రాయపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం పోతేనే రాష్ట్రం బాగుపడుతుందని విజయశాంతి చెప్పారు.