విశాఖలో డ్రగ్స్ కలకలం
ABN , First Publish Date - 2022-08-08T09:29:49+05:30 IST
విశాఖలో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది.
ఐదుగురు అరెస్టు, 50 ఎల్ఎస్డీ బోల్ట్స్ స్వాధీనం
విశాఖపట్నం, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): విశాఖలో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. నెలరోజుల కిందట 61 ఎల్ఎ్సడీ బోల్డ్స్ను పోలీసులు స్వాధీనం చేసుకోగా, తాజాగా గోవా నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసి నగరానికి తెచ్చి విక్రయిస్తున్న ముఠాలోని ఐదుగురు సభ్యులను యాంటీ నార్కోటిక్ సెల్ అధికారులు అరెస్టుచేశారు. వారి నుంచి 50 ఎల్ఎ్సడీ బోల్ట్స్తోపాటు ఎండీఎంఏ పౌడర్గా అనుమానిస్తున్న 4.4 గ్రాముల తెల్లని పౌడర్, ఒక కారు, ఐదు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను పోలీస్ కమిషనరేట్లో ఆదివారం విలేకరుల సమావేశంలో పోలీస్ కమిషనర్ సీహెచ్ శ్రీకాంత్ వెల్లడించారు. నగరంలోని ఎన్ఏడీ కొత్తరోడ్డు ప్రాంతానికి చెందిన పంగి రవికుమార్ (23) ఏజెన్సీ నుంచి గంజాయిని గోవా తీసుకెళ్లి విక్రయిస్తుంటాడు. అక్కడ దిలీప్ అనే వ్యక్తి నుంచి సింథటిక్ డ్రగ్స్ను కొనుగోలుచేసి నగరానికి తెచ్చి విక్రయిస్తుంటాడు. ఆదివారం స్నేహితుల దినోత్సవం కావడంతో గోవా నుంచి 50 ఎల్ఎ్సడీ బోల్ట్స్, ఎండీఎంఏగా అనుమానిస్తున్న పౌడర్ను నగరంలో విక్రయించేందుకు రంగం సిద్ధం చేశాడు.
అయితే ముందస్తు సమాచారం మేరకు కమిషనర్ ఆదేశాలతో యాంటీ నార్కోటిక్ డ్రగ్ సెల్ అధికారులు శనివారం రాత్రి రైల్వేస్టేషన్లో మాటువేసి రవికుమార్ను అదుపులోకి తీసుకున్నారు. అతడు ఇచ్చిన సమాచారం మేరకు డ్రగ్స్ విక్రయిస్తున్న నగరంలోని గోపాలపట్నంకు చెందిన ఓరుగంటి వాసుదేవ కటణ్య (32), సీతంపేటకు చెందిన మల్లాది మోజెస్ (25), 104 ఏరియాకు చెందిన అప్పికొండ యాద కిశోర్ (26), మర్రిపాలెంనకు చెందిన మారె సందీ్పను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 50 ఎల్ఎ్సడీ బోల్ట్ట్స్, 4.4 గ్రాములు పౌడర్, ఐదు సెల్ఫోన్లు, ఒక కారు స్వాధీనం చేసుకున్నారు. దిలీప్ను అరెస్టు చేయాల్సి ఉందని సీపీ తెలిపారు. దిలీప్తోపాటు రవికుమార్, వాసుదేవ క్డసుమారు రూ.500 నుంచి రూ.1,500 వరకు ఉంటుందని, ఎండీఎంఏ పౌడర్ గ్రాము ధర రూ.వెయ్యి నుంచి రూ.5 వేల వరకు ఉంటుందని పోలీసులు వివరించారు.