AP News: విశాఖలో డ్రగ్స్‌ కలకలం

ABN , First Publish Date - 2022-08-08T00:51:05+05:30 IST

విశాఖలో మరోసారి డ్రగ్స్‌ కలకలం రేగింది. నెలరోజుల కిందట 61 ఎల్‌ఎస్‌డీ బోల్డ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.

AP News: విశాఖలో డ్రగ్స్‌ కలకలం

విశాఖపట్నం: విశాఖలో మరోసారి డ్రగ్స్‌ కలకలం రేగింది. నెలరోజుల కిందట 61 ఎల్‌ఎస్‌డీ బోల్డ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆదివారం గోవా నుంచి డ్రగ్స్‌ కొనుగోలు చేసి నగరానికి తెచ్చి విక్రయిస్తున్న ముఠాలోని ఐదుగురు సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 50 ఎల్‌ఎస్‌డీ బోల్ట్స్‌తోపాటు ఎండీఎంఏ పౌడర్‌గా అనుమానిస్తున్న 4.4 గ్రాముల తెల్లని పౌడర్‌, ఒక కారు, ఐదు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2022-08-08T00:51:05+05:30 IST