డ్రగ్స్ సేవిస్తున్న ముగ్గురి అరెస్టు
ABN , First Publish Date - 2021-12-05T06:01:05+05:30 IST
డ్రగ్స్, గంజాయి సేవిస్తున్న ముగ్గురు విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు.
గుంటూరు, డిసెంబరు 4: డ్రగ్స్, గంజాయి సేవిస్తున్న ముగ్గురు విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారిలో హైదరాబాద్లోని అంబర్పేట కామాక్షీపురంనకు చెందిన మోర్తోట రామకృష్ణ హరీష్, పెదపల్లి జిల్లా గోదావరిఖనిలోని తిలక్నగర్కు చెందిన సాయిండ్ల రాజు, ఈపూరు మండలం ఆరేపల్లి ముప్పాళ్లకు చెందిన పులి కిషోర్రెడ్డి ఉన్నారు. నిందితుల నుంచి పోలీసులు పేపర్ తరహాలో ఉండే మూడు డ్రగ్స్ స్ర్టిప్స్, 150 గ్రాముల గంజాయి పొట్లాలు, రూ.8,200 నగదు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. శనివారం నగరంపాలెం పోలీస్స్టేషన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వెస్టు డీఎస్పీ సుప్రజ ముగ్గురు నిందితులను మీడియా ఎదుట హాజరుపరచి వివరాలు వెల్లడించారు. బ్రాడీపేట 4వ లైనులోని లాడ్జిపై పోలీసులు దాడి చేసి ముగ్గురిని అరెస్టు చేసి వారినుంచి డ్రగ్స్, గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.