కొద్ది మొత్తంలో డ్రగ్స్ ఉంటే జైలుకొద్దు!
ABN , First Publish Date - 2021-10-25T06:47:34+05:30 IST
డ్రగ్స్ వినియోగించేవారు, వాటికి బానిసలుగా మారిన వారికి కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ఊరటనిచ్చే ప్రతిపాదనలు చేసింది.
స్వల్పంగా వినియోగిస్తే కూడా..
వారిని బాధితులుగా చూడాలి
‘ఎన్డీపీఎస్’లో సవరణ చేయాలి
కేంద్ర సామాజిక న్యాయం,
సాధికారత శాఖ సూచన
న్యూఢిల్లీ, అక్టోబరు 24: డ్రగ్స్ వినియోగించేవారు, వాటికి బానిసలుగా మారిన వారికి కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ఊరటనిచ్చే ప్రతిపాదనలు చేసింది. మానవతా దృక్పథంతో కూడిన సూచనలు చేసింది. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ చట్టంపై సమీక్షలో భాగంగా ఈ చట్టానికి నోడల్ సంస్థగా ఉన్న రెవెన్యూ శాఖ.. కేంద్ర హోం, ఆరోగ్యం, సామాజిక న్యాయం, సాధికారత శాఖలు, మాదకద్రవ్యాల నియంత్రణ సంస్థ, సీబీఐ తదితర సంస్థలను సూచనలు ఇవ్వాల్సిందిగా కోరింది. చట్టాన్ని హేతుబద్ధీకరించడంతో పాటు ఏమైనా మార్పులు చేయాల్సి ఉంటే తెలియజేయాలని సూచించింది. ఈ క్రమంలో సామాజిక న్యాయం, సాధికారత శాఖ కొద్ది రోజుల కిందట తన సూచనలను తెలియజేసింది.