Andhra Pradesh: డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు

ABN , First Publish Date - 2022-05-18T20:57:05+05:30 IST

బెంగళూరు కేంద్రంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠా సభ్యులను కర్నూలు పోలీసులు అరెస్టు చేశారు. డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్న షేక్ సనావుల్లాను అరెస్టు చేశారు. బెంగుళూరులో రిజ్వాన్ అనే వ్యక్తి దగ్గర

Andhra Pradesh: డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు

Kurnool: బెంగళూరు కేంద్రంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠా సభ్యులను కర్నూలు పోలీసులు అరెస్టు చేశారు. డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్న షేక్ సనావుల్లాను అరెస్టు చేశారు. బెంగుళూరులో రిజ్వాన్ అనే వ్యక్తి దగ్గర డ్రగ్స్ కొని హైదరాబాదుకు తీసుకెళ్తున్నట్లు సనావుల్లా పోలీసుల దర్యాప్తులో అంగీకరించాడు. బెంగళూరుకు చెందిన రిజ్వాన్, హైదరాబాద్ కు చెందిన తరుణ్, మక్బూల్, నరేంద్ర సింగ్, విజయవాడకు చెందిన యశ్వంత్ రెడ్డి, ఏకేశ్వర రెడ్డిలను అరెస్టు చేశారు. ఇప్పటివరకు ఈ కేసులో ఏడుగురు అరెస్టు చేయగా.. మరికొందరు కోసం  పోలీసులు గాలిస్తున్నారు. షేక్ సనావుల్లా దగ్గర 4.3 గ్రాములు, యశ్వంత్ రెడ్డి, ఏకేశ్వర రెడ్డిల నుంచి 3 గ్రాముల డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు రిజ్వాన్ కు డ్రగ్స్ ఎక్కడ నుంచి వస్తుందనే దానిపై పోలీసులు విచారిస్తున్నారు. 

Updated Date - 2022-05-18T20:57:05+05:30 IST