మద్యం కోసం గొడవ.. హత్య

ABN , First Publish Date - 2021-05-10T17:23:27+05:30 IST

మద్యం కోసం ఇద్దరి మధ్య జరిగిన గొడవ ఒకరి హత్యకు దారి తీసింది.

మద్యం కోసం గొడవ.. హత్య

హైదరాబాద్/అంబర్‌పేట : మద్యం కోసం ఇద్దరి మధ్య జరిగిన గొడవ ఒకరి హత్యకు దారి తీసింది. అంబర్‌పేట ఎస్‌హెచ్‌వో బిట్టు మోహన్‌ కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.... అంజి (35), శ్రీనివాస్‌ ఫుట్‌పాత్‌పై నివసిస్తూ చిత్తుకాగితాలు ఏరుకుని జీవిస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం ఇద్దరూ మద్యం తాగి అంబర్‌పేట హోటల్‌ సమీపంలోకి వచ్చారు. ఆ సమయంలో వారి మధ్య మద్యం కోసం గొడవ జరిగింది. ఆవేశంలో శ్రీనివాస్‌ పక్కనే వున్న బండరాయి తీసుకుని అంజి తలపై వేశాడు. అంజి అక్కడికక్కడే మృతి చెందాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.

Updated Date - 2021-05-10T17:23:27+05:30 IST