గూడెం వంతెనను పరిశీలించిన డీఎస్పీ

ABN , First Publish Date - 2022-05-18T04:01:17+05:30 IST

తెలంగాణ- మహారాష్ట్రలను కలుపుతూ మండలంలోని గూడెం సమీపంలో ప్రాణహిత నదిపై నిర్మించిన వంతెనను మంగళవారం కాగజ్‌నగర్‌ డీఎస్పీ కరుణాకర్‌, కౌటాల సీఐ బుద్దే స్వామి పరిశీలించారు

గూడెం వంతెనను పరిశీలించిన డీఎస్పీ
గూడెం వంతెనను పరిశీలిస్తున్న కాగజ్‌నగర్‌ డీఎస్పీ కరుణాకర్‌, కౌటాల సీఐ బుద్దే స్వామి

చింతలమానేపల్లి, మే 17: తెలంగాణ- మహారాష్ట్రలను కలుపుతూ మండలంలోని గూడెం సమీపంలో ప్రాణహిత నదిపై నిర్మించిన వంతెనను మంగళవారం కాగజ్‌నగర్‌ డీఎస్పీ కరుణాకర్‌, కౌటాల సీఐ బుద్దే స్వామి పరిశీలించారు. ఇటీవల  వంతెనకు 20 కిలో మీటర్లలోని మహారాష్ట్ర హేటపల్లి సమీప ప్రాంతంలో మావోయిస్టులు ఓ కాంట్రాక్టర్‌కు చెందిన రెండు ఎక్స్‌కవేటర్లు ఒక లారీ, ఒక ట్రాక్టర్‌తో సహా ఇతర వాహనాలను ధ్వంసం చేశారు. ఇదే సమయంలో గూడెం వంతెనకు ఏర్పాటు చేసిన శిలాఫలాకాలు ధ్వంసం కావడం చర్చనీయాంశం అయింది. దీంతో కాగజ్‌నగర్‌ డీఎస్పీ కరుణాకర్‌, కౌటాల సీఐ బుద్దే స్వామి ధ్వంసం అయిన శిలాఫలాకలను పరిశీలిం చారు. గాలి దుమారం, వడగండ్ల వర్షం రావడంతోనే ధ్వంసమయ్యా యని తెలిపారు. వీరి వెంట ఎస్సై విజయ్‌ సిబ్బంది ఉన్నారు. 

Updated Date - 2022-05-18T04:01:17+05:30 IST