ఎస్ఐ పరీక్షల అక్రమాల్లో లింగసుగూరు డీఎస్పీపై వేటు
ABN , First Publish Date - 2022-05-08T17:03:47+05:30 IST
సబ్ ఇన్స్పెక్టర్ పరీక్షల నిర్వహణలో జరిగిన అవకతవకలకు సంబంధించి అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్న లింగసుగూరు డీఎస్పీ మల్లికార్జున్సాలిని ఉన్నతాధికారులు సస్పెండ్
రాయచూరు(బెంగళూరు): సబ్ ఇన్స్పెక్టర్ పరీక్షల నిర్వహణలో జరిగిన అవకతవకలకు సంబంధించి అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్న లింగసుగూరు డీఎస్పీ మల్లికార్జున్సాలిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. రెండు రోజుల క్రితం సీఐడీ అధికారులు డీఎస్పీపై కేసు నమోదు చేయగా ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. కలబురిగి జిల్లాలోని జ్ఞానజ్యోతి కళాశాల కార్యదర్శి, హెడ్మాస్టర్ను బ్లాక్ మెయిల్ చేసి రూ. 10 లక్షలు డిమాండ్ చేశాడన్న ఆరోపణల మేరకు డీఎస్పీపై ఇప్పటికే సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు.