మాల్దీవుల్లో అదృశ్యమైన భార్య.. వెతికిపెడితే రూ. 70 లక్షలిస్తానంటున్న భర్త

ABN , First Publish Date - 2021-02-24T15:32:39+05:30 IST

మాల్దీవుల్లో అదృశ్యమైన తన భార్యను వెతికిపెడితే లక్ష డాలర్లు(రూ. 72.37 లక్షలు) ఇస్తానని దుబాయికి చెందిన పర్మార్ గుర్షరాంజీత్

మాల్దీవుల్లో అదృశ్యమైన భార్య.. వెతికిపెడితే రూ. 70 లక్షలిస్తానంటున్న భర్త

దుబాయి: మాల్దీవుల్లో అదృశ్యమైన తన భార్యను వెతికిపెడితే లక్ష డాలర్లు(రూ. 72.37 లక్షలు) ఇస్తానని దుబాయికి చెందిన పర్మార్ గుర్షరాంజీత్ సింగ్ అనే వ్యక్తి ప్రకటించాడు. వివరాల్లోకి వెళ్తే.. పర్మార్, తన భార్య గియడ్రే వాస్కైట్(33) కొద్దిరోజుల క్రితం మాల్దీవుల ట్రిప్‌కు వెళ్లారు. ఫిబ్రవరి 13వ తేదీ మధ్యాహ్నం గియడ్రే ఒక్కసారిగా అదృశ్యమైంది. అధికారులు ఎంత వెతికినా గియడ్రే ఆచూకీ మాత్రం దొరకలేదు. వారం రోజుల పాటు వెతికినా తన భార్య ఆచూకీ దొరకకపోవడంతో పర్మార్ తిరిగి దుబాయికి వచ్చేశాడు. 


గర్భంతో ఉన్న తన భార్య నీళ్లలో మునిగిపోయిందా లేక కిడ్నాప్‌కు గురైందా లేదా ఏదైనా జరిగిందా అనేది తనకు అర్థం కావడం లేదంటూ పర్మార్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. నీళ్లలోనే మునిగిపోయి ఉండొచ్చని పోలీసు అధికారులు చెబుతున్నారని, తన భార్య స్విమ్మర్ అని, ఆమె అంత తేలికగా నీళ్లలో మునిగిపోదని పర్మార్ చెబుతున్నాడు. ఒకవేళ నీళ్లలో మునిగినా వారం రోజులైనా మృతదేహం ఎందుకు పైకి తేలలేదని పర్మార్ ప్రశ్నిస్తున్నాడు. ఇప్పుడు రివార్డ్ ప్రకటించడంతో తన భార్య దొరుకుతుందేమోనని ఆశిస్తున్నట్టు పర్మార్ తెలిపాడు. 

Updated Date - 2021-02-24T15:32:39+05:30 IST