UAE-NEET: యూఏఈలో నీట్ పరీక్ష.. భారతీయ ఎంబసీ కీలక ప్రకటన!
ABN , First Publish Date - 2022-07-16T02:06:22+05:30 IST
యూఏఈలోని మూడు కేంద్రాల్లో నీట్(NEET) పరీక్ష జరగనున్నట్టు దుబాయ్లోని భారతీయ రాయబార కార్యాలయం(Indian embassy) తాజాగా ఓ ప్రకటనలో తెలిపింది.
ఎన్నారై డెస్క్: యూఏఈలోని మూడు కేంద్రాల్లో నీట్- 2022(NEET) పరీక్ష జరగనున్నట్టు దుబాయ్లోని భారతీయ రాయబార కార్యాలయం(Indian embassy) తాజాగా ఓ ప్రకటనలో తెలిపింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) విడుదల చేసిన పరీక్ష షెడ్యూల్ను పేర్కొంది. అబుధాబీలోని అబుధాబీ ఇండియన్ స్కూల్, దుబాయ్లోని ఇండియన్ హైస్కూల్, షార్జాలోని ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్లో ఈ పరీక్ష నిర్వహిస్తారు. జూలై 17న ఈ పరీక్ష జరుగుతుంది. పేపర్ అండ్ పెన్ విధానంలో జరిగే ఈ పరీక్ష మధ్యాహ్నం 12.30కు ప్రారంభమై 3.50 గంటలకు ముగుస్తుంది. పరీక్ష రోజు ఉదయం 9.30 నుంచి 12.00 లోపు విద్యార్థులు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని ఎంబసీ పేర్కొంది. 12.00 తరువాత ఏ విద్యార్థినీ లోపలకు అనుమతించరు. ఇక పరీక్షకు సంబంధించిన ఇతర అప్డేట్ల కోసం http://neet.nta.nic.in వెబ్సైట్ చూడాలని విద్యార్థులకు ఎంబసీ సూచించింది.